గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 5 అక్టోబరు 2016 (15:36 IST)

బీసీసీఐ అధికారులను బట్టలూడదీసి.. వెనక వాచేలా వంద దెబ్బలేయాలి: ఖట్జూ

బీసీసీఐ- లోధాకమిటీల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. లోధా కమిటీ 159 సవరణలతో కూడిన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. అయితే ఈ కమిటీ చేసిన సిఫార్సుల్లో కొన్నింటిని బీసీసీఐ వ్యతిరేకించి

బీసీసీఐ- లోధాకమిటీల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. లోధా కమిటీ 159 సవరణలతో కూడిన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. అయితే ఈ కమిటీ చేసిన సిఫార్సుల్లో కొన్నింటిని బీసీసీఐ వ్యతిరేకించింది. దీంతో సుప్రీం సీరియస్ అయ్యింది. లోధాకమిటీ సిఫార్సులను పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అకౌంట్లు మూతపడ్డాయని.. తద్వారా భారత్-కివీస్‌ల మధ్య జరుగుతున్న క్రికెట్ సిరీస్‌ను నిర్వహించలేమని  బీసీసీఐ చేతులెత్తేసింది. 
 
కానీ లోధా కమిటీ మాత్రం బీసీసీకి చెందిన అకౌంట్లను క్లోస్ చేయలేదని.. ఎప్పటిలాగానే బీసీసీఐ క్రికెట్ సిరీస్‌లను నిర్వహించుకోవచ్చునని క్లారిటీ ఇచ్చింది. దీంతో భారత్-కివీస్‌ల మధ్య ఇంకా ఓ టెస్టు, ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుందా లేదా అనే దానిపై ఇంకా బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. ఇలా బీసీసీఐ- లోధా కమిటీల మధ్య జరుగుతున్న కోల్డ్‌ వార్‌లో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కంటేయ ఖట్జూ కాస్త ఆజ్యం పోశారు. ట్విట్టర్లో ఖట్జూ స్పందిస్తూ.. బీసీసీఐకి ఈ శిక్ష మాత్రమే సరిపోదని, బీసీసీఐ అధికారులను బట్టలూడదీసి కంబానికి కట్టేసి.. వెనక వాచేలా వంద దెబ్బలేయాలన్నారు.
 
అయితే ఖట్జూ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో లోధా కమిటీ సిఫార్సులపై విరుచుకుపడ్డారని.. ఈ కమిటీ సిఫార్సులు చట్టవిరుద్ధమైనవని, లోధాకమిటీ తన నివేదికను ముందుగా పార్లమెంట్‌కు పంపాల్సిందని, మంత్రి వర్గ ఆమోదం తర్వాతే.. దీనిపై క్లారిటీ వస్తుందన్నారు. అప్పట్లో లోధాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఖట్జూ.. ప్రస్తుతం బీసీసీఐ అధికారులను తాట తీయాలని వ్యాఖ్యానించడం కలకలం సృష్టిస్తోంది.