శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 జూన్ 2016 (12:22 IST)

టీమిండియా కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూలు పూర్తి.. అనిల్ కుంబ్లే వైపే త్రయం చూపు!

టీమిండియా కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. అనిల్ కుంబ్లే, ప్రవీణ్, లక్ష్మణ్‌లు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అనిల్ కుంబ్లే వైపే సెలెక్టర్లు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

టీమిండియా కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. అనిల్ కుంబ్లే, ప్రవీణ్, లక్ష్మణ్‌లు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అనిల్ కుంబ్లే వైపే సెలెక్టర్లు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కోచ్ పదవికి ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా ముగిసినట్టు ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. ఇక త్వరలో కుంబ్లేనే ప్రకటించే అవకాశం ఉందని క్రీడా పండితులు అంటున్నారు.
 
ఈ బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ మంగళవారం ఏడుగురు అభ్యర్థులను ఇంటర్య్వూ చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలకు అనిల్ కుంబ్లే, ప్రవీణ్ ఆమ్రే, లాల్ చంద్ రాజ్‌పుత్ సభ్యుల ఎదుట నేరుగా హాజరవ్వగా, రవి శాస్త్రి, టామ్ మూడీ, స్టువర్ట్‌లా, ఆండీ మోల్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అయితే సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లు అనిల్ కుంబ్లే వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు వార్తలొస్తున్నాయి.