బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2015 (20:14 IST)

వరల్డ్ కప్‌ 2019లో రీఎంట్రీ ఖాయం : క్రికెటర్ శ్రీశాంత్ ధీమా

2019లో జరిగే ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో రీ ఎంట్రీ ఖాయమని కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి శ్రీశాంత్‌తో సహా ఇతర క్రికెటర్లను ఢిల్లీ పాటియాలా కోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి శ్రీశాంత్ వచ్చాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్ మాట్లాడుతూ ఫిక్సింగ్ వ్యవహారం కారణంగా క్రికెట్‌కు దూరమైన తాను పునరాగమనం ఖాయమన్నాడు. జట్టులోకి వస్తానని, 2019లో జరిగే ప్రపంచకప్‌లో ఆడుతానని విశ్వాసం వ్యక్తం చేశాడు. బీసీసీఐ తనపై నిషేధం తొలగిస్తుందన్న నమ్మకం ఉందని అన్నాడు. 
 
కాగా, ఫిక్సింగ్ ఆరోపణలెదుర్కొన్న క్రికెటర్లను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. దీంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాత్రం సదరు ఆటగాళ్లపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ శ్రీశాంత్ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.