గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (19:40 IST)

ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఒత్తిడితో ఓడిపోయాం: ధోనీ

ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో 329 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్ ఒత్తిడితోనే ఓడిపోయిందని కెప్టెన్ ధోనీ అన్నాడు. ఆస్ట్రేలియాతో ఓటమి అనంతరం కెప్టెన్ ధోని మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించలేకపోయామని, ఈ మ్యాచ్ లో స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయామని చెప్పాడు. భారత్ ఓపెనర్లు శుభారంభం అందించినా వెంటవెంటనే కీలక వికెట్లు కోల్పోవడం వల్ల ఓడిపోయామని అన్నాడు. 
 
తాను కూడా పూర్తిస్థాయిలో రాణించలేకపోయానని ధోనీ అంగీకరించాడు. రిటైర్మెంట్‌పై ధోనీ స్పందిస్తూ.. తన వయసు 33 ఏళ్లని, వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచ కప్లో ఆడుతానని, ఆ తర్వాత ఫిట్నెస్ను బట్టి 2019 ప్రపంచ కప్లో ఆడాలా వద్దా అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటానని ధోనీ వ్యాఖ్యానించాడు.