మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 జులై 2016 (14:15 IST)

ధోనీ, రైనాలకు వ్యభిచార బ్రోకర్‌తో సంబంధం ఉందా?: వైరల్‌గా మారిన ఫోటో!

టీమిండియా వన్డే కెప్టెన్ ధోనీ, స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనాలకు వ్యభిచార బ్రోకర్‌ ప్రీతింద్రనాథ్ సన్యాల్‌తో సంబంధం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్‌గా మారింది. ఢిల్లీలో

టీమిండియా వన్డే కెప్టెన్ ధోనీ, స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనాలకు వ్యభిచార బ్రోకర్‌ ప్రీతింద్రనాథ్ సన్యాల్‌తో సంబంధం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్‌గా మారింది. ఢిల్లీలోని సప్తర్‌జంగ్ ప్రాంతంలో ఉన్న 62 ఏళ్ల ప్రీతింద్రనాథ్ సన్యాల్‌కు సొంతమైన ఇంటిపై ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. 
 
ఈ సోదాల్లో సన్యాల్ ఎన్‌క్లేవ్ ఇంట్లో 23 ఏళ్ల మహిళను నిర్భంధించినట్లు తెలిసింది. ఆమె రష్యాకు చెందిందని తెలిసింది. ఆమెను ఐటీ అధికారులు రక్షించి పోలీసులకు అప్పగించారు. ఇంకా ఈ సోదాల్లో తేలిందేమిటంటే..? సన్యాల్ విదేశాలకు చెందిన అమ్మాయిలను కిడ్నాప్ చేసి.. భారత్‌లో వ్యభిచార రొదిలోకి దించేవాడని విచారణలో తేలింది. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో సన్యాల్‌కు ధోనీ, సురేష్ రైనాలతో సంబంధం ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇందుకు సన్యాల్‌తో ధోనీ, రైనాలు తీసిన ఫోటో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్‌గా మారింది. ధోనీ బర్త్ డేను గుర్గాన్ ఫామ్ హౌస్‌లో సెలెబ్రేట్ చేసిన సందర్భంగా ఈ ఫోటోను తీసినట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ జరుగుతోంది.