బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (17:47 IST)

లండన్ ఛారిటీ మ్యాచ్‌లో ధోనీ, సెహ్వాగ్, అఫ్రిదీలకు చోటు!

క్రికెట్ అభిమానులకో శుభవార్త. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఛారిటీ మ్యాచ్‌లో ఈ ఏడాది టీమిండియా కెప్టెన్ ధోనీ, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు పాల్గొంటున్నారు. ప్రతి ఏడాది 'హెల్ప్ ఫర్ హీరోస్' పేరిట ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తుంది. ఈ మ్యాచ్‌లో ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లు పాల్గొననున్నారు.
 
ఆ ఆటగాళ్ల జాబితాలో ధోనీ, సెహ్వాగ్, పాకిస్థాన్ ఆటగాడు అఫ్రిదీ కూడా చోటు సంపాదించుకున్నారు. ఈ మ్యాచ్ నిర్వహణ బాధ్యతలను ఈసీబీ డైరెక్టర్ ఆండ్రూ నిర్వహిస్తుండగా, గవాస్కర్ కూడా నిర్వహణలో పాలుపంచుకోనున్నారు.
 
కాగా, అంతర్జాతీయ స్టార్లతో కలిసి మ్యాచ్ ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు. ఓ మంచి ఆశయం కోసం జరుగుతున్న మ్యాచ్‌లో భాగం కావడం గర్వకారణమని ధోనీ తెలిపాడు. అంతేగాకుండా ఈ మ్యాచ్‌కు అందరి మద్దతు అవసరమన్నాడు.