గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (11:38 IST)

భారత క్రికెట్‌లో ఫాస్ట్ బౌలింగ్ శకం ప్రారంభమవుతుంది: వసీం అక్రమ్

భారత క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్ శకం ప్రారంభమయ్యే రోజులు సమీపిస్తున్నాయని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తెలిపాడు. కోల్ కతాలో ఆయన మాట్లాడుతూ, భారత క్రికెట్‌లో ఫాస్ట్ బౌలింగ్ త్వరలోనే అంతర్భాగం కానుందని అన్నాడు. ఐపీఎల్ కోల్ కతా నైట్ రైడర్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్న వసీం ఆధ్వర్యంలోనే అశోక్ దిండా, ఇషాంత శర్మ అద్భుత ప్రదర్శనతో టీమిండియాలో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే. 
 
యువ ఆటగాళ్లు షమీ, ఉమేష్ యాదవ్ ఫాస్ట్ బౌలింగ్ లో రాటుదేలుతున్నారని, వారిని హీరోలుగా వర్థమాన ఆటగాళ్లు భావిస్తున్నారని వసీం తెలిపాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్‌కు ధీటుగా భారత బౌలర్లు సన్నద్ధమయ్యే రోజులు వచ్చేస్తున్నాయని వసీమ్ అక్రమ్ చెప్పాడు.