బంగ్లాదేశ్లో భారత్ టూర్ : ఒక టెస్టు, 3 వన్డేలు.. ప్రపంచకప్ తర్వాత..
ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓడి వరల్డ్ కప్ను జారవిడుచుకున్న తర్వాత టీమిండియా అంతర్జాతీయ టూర్కు సిద్ధమైంది. ప్రపంచకప్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్లో పర్యటించనుంది. ఈ టూర్లో భాగంగా బంగ్లాదేశ్తో ఒక టెస్టు, 3 వన్డే పోటీల్లో ఆడుతుంది.
ఇకపోతే జూన్ 7వ తేదీ భారత్.. బంగ్లాదేశ్కు బయల్దేరుతుంది. అలాగే బదుల్లాలో తొలి టెస్టు జరుగనుంది. తొమ్మిదేళ్ల తర్వాత ఇక్కడ టెస్టు పోటీ జరుగనుంది. జూన్ 10 తేదీ తొలి టెస్టు జరుగుతుంది. టెస్టు ముందు భారత్ వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది.
కాగా జూన్ 18, 21, 24 తేదీల్లో వన్డే మ్యాచ్లుంటాయి. మిర్పూర్లోనే 3 వన్డేలు జరుగుతాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. జూన్ 26తో బంగ్లాదేశ్లో భారత్ టూర్ ముగుస్తుంది. ఇకపోతే.. జూలైలో-ఆగస్టులో దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది.