శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 12 నవంబరు 2016 (16:23 IST)

'14 ప్లేయర్స్-ఎ సైడ్' ప్రయోగాత్మక పద్ధతి సక్సెస్.. 19 పరుగులిచ్చి 7 వికెట్లు కొట్టిన బుడతడు..

''14 ప్లేయర్స్-ఎ సైడ్'' అనే ప్రయోగాత్మక పద్ధతి సక్సెస్ అయ్యింది. ఈ పద్ధతికి ఐడియా ఇచ్చింది ఎవరో కాదు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. నాణ్యమైన క్రికెటర్లు టీమిండియాకు రావాలంటే 11 మందికి బదులు 15మ

''14 ప్లేయర్స్-ఎ సైడ్'' అనే ప్రయోగాత్మక పద్ధతి సక్సెస్ అయ్యింది. ఈ పద్ధతికి ఐడియా ఇచ్చింది ఎవరో కాదు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. నాణ్యమైన క్రికెటర్లు టీమిండియాకు రావాలంటే 11 మందికి బదులు 15మంది ఉండాలే చూడాలని మూడేళ్ల క్రితం సచిన్.. ముంబై క్రికెట్ అసోసియేన్ (ఎంసీఏ)కు సూచించాడు.

జాతీయ జట్టులో స్థానం లభిస్తుందో లేదో అనే విషయాన్ని పక్కనబెడితే.. ఈ పద్ధతి ద్వారా ప్రతి ఆటగాడికి అవకాశం లభిస్తుందని సచిన్ సూచించాడు. తద్వారా క్రికెటర్ల ప్రతిభ బయటపడుతుందని సచిన్ సూచన చేశాడు. ఈ నేపథ్యంలో ఆనాటి సచిన్ నిర్ణయంపై ఆలోచన చేసిన ఎంసీఏ పెద్దలు దాన్ని తాజాగా అమలు చేశారు.
 
హారిస్ షీల్డ్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ లో ఒక జట్టు 14 మందితో ఆడింది. ఇందులో భాగంగా ఎస్ కే జైన్‌తో జరిగిన మ్యాచ్‌లో బాంబే స్కాటిష్ కుర్రాడు చెలరేగిపోయాడు. ఇలా అవకాశం దక్కించుకున్న స్పిన్నర్ శివమ్ నాయక్ 19 పరుగులిచ్చి ఏడు వికెట్లతో పడగొట్టి సత్తా చాటుకున్నాడు. 
 
అంతకుముందు ఈ కుర్రాడు మెరుగ్గా ఆడుతున్నప్పటికీ ఫీల్డింగ్, బ్యాటింగ్ ప్రధానం కాబట్టి అతనికి అవకాశాలు రాలేదని బాంబే స్కాటిష్ కోచ్ నిలేష్ రావుత్ స్పష్టం చేశాడు. తాజాగా '14 ప్లేయర్స్-ఎ సైడ్' అనే ప్రయోగాత్మక పద్ధతితో అతనికి అవకాశం లభించిదని రావుత్ అన్నాడు. ప్రధానంగా సచిన్ సలహాతో ఆ కుర్రాడు ప్రతిభ వెలుగులోకి వచ్చిందని చెప్పుకొచ్చాడు.