జెంటిల్మన్ గేమ్ కోసం క్రీజులోకి దిగుతున్న క్రికెట్ దేవుడు సచిన్!
క్రికెట్ దేవుడు సచిన్ మళ్లీ క్రీజులోకి దిగనున్నాడు. జెంటిల్మన్ గేమ్ కోసం సచిన్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. జెంటిల్మన్ గేమ్ అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయితే ఈ గేమ్కు క్రేజ్ పెంచే క్రమంలోనే సచిన్ ఈ టోర్నీలో ఆడనున్నాడని క్రికెట్ పండితులు అంటున్నారు. అమెరికాలో దేశ పౌరులకు క్రికెట్పై ఆసక్తి పెంచే దిశగా ఆ దేశం నడుం బిగించింది.
వచ్చేనెల 7న న్యూయార్క్లో, 11న హోస్టన్లో, 14న లాస్ ఏంజెలిస్లో మ్యాచ్లు జరుగనున్నాయి. ఇక క్రికెట్కు ఇప్పటికే వీడ్కోలు పలికిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్తో పాటు 25 మంది ప్రపంచ క్రికెట్ స్టార్ ప్లేయర్లను ఈ టోర్నీ బరిలోకి దిగనున్నారు. టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ మ్యాచ్ల్లో సచిన్ తో పాటు షేన్ వార్న్, వసీం అక్రం, మైఖేల్ వాన్, మహేళ జయవర్ధనే, బ్రియన్ లారా, జాకస్ కలిస్ తదితర 25 మంది దిగ్గజాలు పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు.