శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 16 మే 2015 (12:10 IST)

నా కూతురు రాకతో హ్యాపీ.. టీమిండియాకు ఆడాలనుంది!: శ్రీశాంత్

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్న క్రికెటర్ శ్రీశాంత్.. మళ్లీ జాతీయ జట్టు తరపున బరిలోకి దిగాలనుకుంటున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని కొన్ని రోజులు జైల్లో కూడా గడిపి... క్రికెట్ కెరీర్‌ను శ్రీశాంత్ చేతులారా నాశనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ టీమిండియాకు ఆడాలనుందని చెప్పాడు. 
 
ప్రస్తుతం స్పాట్ ఫిక్సింగ్ యవ్వారంతో శ్రీశాంత్ జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్నాడు. కొద్ది రోజుల క్రితం కూతురు పుట్టడంతో ఓ తండ్రిగా శ్రీశాంత్ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, "నా కూతురు రాకతో నా జీవితం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఎన్నో కొత్త మార్పులు సంభవిస్తాయన్న ఆశ నాలో కలుగుతోంది. మళ్లీ టీమిండియాకు ఆడాలని ఉంది" అని చెప్పాడు. వచ్చే రెండు నెలల్లో పాపకు పేరు పెట్టే కార్యక్రమం ఉంటుందని శ్రీ తెలిపాడు.