రైనా, రవీంద్ర జడేజా, బ్రావోలు బెట్టింగ్కు పాల్పడ్డారని అంగీకరించిన ఐసీసీ
ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ యవ్వారం రోజుకో కొత్త విషయాన్ని వెలుగులోకి తెస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులుగా ఉన్న ఈ ముగ్గురూ మ్యాచ్లను ఫిక్స్ చేసేందుకు అంగీకరించి బుకీల నుంచి పెద్దఎత్తున డబ్బు స్వీకరించినట్టు మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ముగ్గురు ఐపీఎల్ ఆటగాళ్లు సురేష్ రైనా, రవీంద్ర జడేజా, బ్రావోలు బెట్టింగ్కు సహకరించినట్లు లలిత్ మోడీ తమకు మెయిల్ పంపిన మాట వాస్తవమేనని ఐసీసీ ఒప్పుకుంది. ఈ సమాచారాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగాగానికి పంపడంతో పాటు.. బీసీసీఐ అవినీతి నిరోధక అధికారులకు కూడా సమాచారాన్ని చేరవేశామన్నారు. అయితే, వారేమి చర్యలు తీసుకున్నారన్న విషయంపై తమకు తిరిగి సమాచారం రాలేదని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.