గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2015 (10:01 IST)

పాక్ క్రికెటర్లు ఆసిఫ్, సల్మాన్ భట్‌లపై నిషేధం ఎత్తివేసిన ఐసీసీ

అవినీతి వ్యవహారంలో నిషేధానికి గురైన పాకిస్థాన్ క్రికెటర్లు మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్‌పై ఐసీసీ నిషేధం ఎత్తివేసింది. మహ్మద్ ఆసిఫ్, సల్మాన్‌ భట్‌లపై విధించిన నిషేధం సెప్టెంబరు 1 అర్ధరాత్రితో ముగుస్తుందని ఐసీసీ తెలిపింది. 
 
ఆ క్రికెటర్లు సెప్టెంబరు 2 నుంచి అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అర్హులని పేర్కొంది. ఇక, ఈ ఏడాది ఆరంభంలో పాక్ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు అనుమతించిన మహ్మద్ అమీర్‌పై కూడా నిషేధం పూర్తి స్థాయిలో తొలగిపోతుందని ఐసీసీ వెల్లడించింది. అమీర్ కూడా ఇక అంతర్జాతీయ క్రికెట్ ఆడవచ్చని వివరించింది. 
 
2010 ఆగస్టులో ఇంగ్లాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో ఈ ముగ్గురు ఆటగాళ్లు అవినీతికి పాల్పడ్డారంటూ స్వతంత్ర యాంటీ కరప్షన్ ట్రైబ్యునల్ తేల్చింది. కాగా, తమపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించడంతో పాక్ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేశారు.