ఇండియన్ క్రికెట్ టీమ్... నెంబర్ 1, నెంబర్ 2 పాక్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా మొదటి స్థానానికి చేరుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో కోహ్లి సేన టాప్ ర్యాంకులో నిలిచింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా మొదటి ర్యాంకు సొంతం చేసుకుంది.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా మొదటి స్థానానికి చేరుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో కోహ్లి సేన టాప్ ర్యాంకులో నిలిచింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా మొదటి ర్యాంకు సొంతం చేసుకుంది.
3-0తో సిరీస్ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేయడంతో మొదటి ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. 112 రేటింగ్ పాయింట్స్తో భారత్ వరల్డ్ ఫస్ట్ ర్యాంక్లో నిలవగా, ఇప్పటివరకూ టాప్లో ఉన్న ఆస్ట్రేలియా 108 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్ 111 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.