శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2015 (17:03 IST)

ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్-10: విరాట్ కోహ్లీ అవుట్- రవిచంద్రన్ అశ్విన్ ఇన్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా దిగజారాడు. శ్రీలంక క్రికెట్ సిరీస్‌లో ఆకట్టుకోని ఆటతీరులో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దిగజారాడు. లంక సిరీస్‌కు ముందు టాప్ టెన్‌లో చోటు సంపాదించుకున్న కోహ్లీ, శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల తర్వాత 11వ స్థానానికి పడిపోయాడు. 
 
బంగ్లాదేశ్, శ్రీలంక టెస్టు సిరీస్‌లో విశేషంగా రాణించి సీనియర్ల మన్ననలందుకున్న రవిచంద్రన్ అశ్విన్ టెస్టు బౌలర్లలో 8వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే ఆల్ రౌండర్లలో అశ్విన్ రెండో ర్యాంకులో ఉన్నాడు. తద్వారా ఐసీసీ ర్యాంకింగ్స్ రెండు విభాగాల్లోనూ అశ్విన్ టాప్-10లో కొనసాగుతున్నాడు. 
 
22వ ర్యాంకులో ఉన్న రహానే శ్రీలంక సిరీస్‌లో సెంచరీ తరువాత రెండు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంకును సొంతం చేసుకోగా, లంకేయులతో జరిగిన రెండు టెస్టుల్లో మూడేసి వికెట్లతో రాణించిన స్పిన్నర్ అమిత్ మిశ్రా 42 స్థానాలు మెరుగుపరుచుకుని, 39వ ర్యాంకుకు ఎగబాకాడు.