గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (14:14 IST)

2016 టీ20 వరల్డ్‌ కప్‌కు భారత్‌ ఆతిథ్యం: మార్చి 11 నుంచి...

వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ట్వంటీ20 వరల్డ్‌ కప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీ 2016 మార్చి 11 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరుగుతుంది. ఇక, స్లో ఓవర్ రేట్ విషయాల్లో కెప్టెన్లకు కొంత ఊరటనిస్తూనే మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించింది.

ఇతర సిరీస్‌లలో నమోదైన స్లో ఓవర్ రేటు తప్పిదాలను ఐసీసీ వరల్డ్ కప్‌లో పరిగణనలోకి తీసుకోరు. అయితే, ఐసీసీ ఈవెంట్‌లో స్లో ఓవర్ రేట్ తప్పిదాలకు పాల్పడే కెప్టెన్లపై మాత్రం నిషేధం అమలు కానుంది. ఈ మేరకు పలు అంశాలపై ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది.