దక్షిణాఫ్రికా టూర్: వన్డే, ట్వంటీ-20 జట్ల ప్రకటన.. ధోనీ కెప్టెన్!
దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా వన్డే, ట్వంటీ-20 జట్లకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీనే కెప్టెన్సీ సారథ్యం వహించనున్నాడు. అలాగే ఈ జట్టులో కొత్త ఆటగాళ్లకు సెలెక్షన్ కమిటీ సభ్యులు అవకాశం కల్పించారు. వన్డే జట్టులో ఆల్ రౌండర్గా గురుకీరత్ సింగ్కు సెలెక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. ఇక టీ20 జట్టులో స్పిన్నర్లు హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రాలతో పాటు కొత్త కుర్రాడు ఎస్ అరవింద్కు అవకాశం కల్పించింది.
ఇకపోతే.. మహేంద్ర సింగ్ ధోనీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రెహానే, అంబటి రాయుడు, సురేశ్ రైనా, అక్షర్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, రవిచంద్రన్ అశ్విన్, గురుకీరత్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్ వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నారు.
ట్వంటీ-20 జట్టులో ధోనీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కోహ్లీ, రెహానే, రాయుడు, అక్షర్ పటేల్, బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, అమిత్ మిశ్రా, ఎస్ అరవింద్లకు జట్టులో సంపాదించుకున్నారు.