గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 నవంబరు 2016 (10:18 IST)

మొహాలీ టెస్ట్ : ఇంగ్లండ్ ఫస్ట్ ఇనింగ్స్‌లో 283 పరుగుల వద్ద ఆలౌట్

మొహాలీలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆటను 8 వికెట్ల నష్టానికి 268 పరుగుల వద్ద ముగించిన ఇంగ్లండ్ జట్ట, రెండో రోజు ఆరంభంలోనే చాపచుట్టేసింది. తొలి రోజు స్కోరుకు 15 పరుగుల

మొహాలీలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆటను 8 వికెట్ల నష్టానికి 268 పరుగుల వద్ద ముగించిన ఇంగ్లండ్ జట్ట, రెండో రోజు ఆరంభంలోనే చాపచుట్టేసింది. తొలి రోజు స్కోరుకు 15 పరుగులను మాత్రమే చేర్చగలిగింది. నాలుగు ఓవర్లు కూడా పూర్తి కాకుండానే చేతిలో మిగిలివున్న రెండు వికెట్లనూ కోల్పోయింది. 
 
ఆదివారం రెండో ఓవర్‌ను వేసిన షమీకి... అంటే ఇన్నింగ్స్ 91.1 బంతికి రషీద్, ఆపై 93.5వ బంతికి బాట్టీ వికెట్ల ముందు దొరికిపోయారు. ఇద్దరి వికెట్లూ షమీకే చిక్కాయి. ఇంగ్లండ్ జట్టు 283 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. 
 
అంతకుముందు. ఇంగ్లండ్ ఈమ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెల్సిదే. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లకు 268 పరుగులు చేసింది. జానీ బెయిర్‌స్టో (117 బంతుల్లో 6 ఫోర్లతో 89) అర్థ శతకంతో మెరవగా, జోస్‌ బట్లర్‌ (80 బంతుల్లో 5 ఫోర్లతో 43) రాణించాడు. ఓపెనర్‌ హసీబ్‌ హమీద్‌ (9), జో రూట్‌ (15), మొయిన్‌ అలీ (16) నిరాశ పరిచారు. కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ (27)తో పాటు బెన్‌ స్టోక్స్‌ (29), క్రిస్‌ వోక్స్‌ (25) శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. 
 
ఒక దశలో 87 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును బెయిర్‌స్టో ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. భారత బౌలర్లలో జయంత యాదవ్‌, రవీంద్ర జడేజా, ఉమేష్‌ యాదవ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. మహ్మద్‌ షమి, అశ్విన్‌ చెరో వికెట్‌ తీశారు. రెండో రోజున చివరి రెండు వికెట్లూ షమీకే దక్కాయి.