శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (16:08 IST)

బ్రిస్బేన్‌ ట్వంటీ-20.. భారత్ విజయలక్ష్యం 174 ఫర్ 17 ఓవర్స్

భారత్-ఆస్ట్రేలియాల మధ్య బ్రిస్బేన్‌లో జరుగుతున్న తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. మూడు ట్వంటీ-20 సిరీస్‌లో భాగంగా.. తొలి టీ-20లో తొలుత టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితులు బౌలింగ్‌కు అనుకూలంగా వుండటంతో ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.


ఎప్పటిలాగానే మ్యాచ్‌కు ముందుగానే తుది జట్టును భారత్ ప్రకటించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు ఆస్ట్రేలియా జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. స్వల్ప పరుగులకే మూడు వికెట్లు పడగొట్టారు. 
 
ఈ క్రమంలో ఖలీల్ అహ్మద్ ధాటికి ఆసీస్ ఓపెనర్ షార్ట్ పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నం చేసిన ఫించ్, క్రిస్ లైన్ కూడా ఖలీల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. ఈ క్రమంలో షార్ట్ ఏడు పరుగుల వద్ద అవుట్ కాగా, పించ్ 27 పరుగుల వద్ద వెనుదిరిగాడు. అలాగే లైన్ 37 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఆపై బరిలోకి దిగిన మ్యాక్స్ వెల్ ధీటుగా ఆడాడు. 
 
భారత బౌలర్ల ధాటికి నిలకడగా బ్యాటింగ్ చేసిన మ్యాక్స్ వెల్ 46 పరుగులు సాధించాడు. కానీ బూమ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇతనికి గట్టి భాగస్వామ్యం ఇచ్చిన స్టోనిస్ 33 పరుగులతో రాణించి నాటౌట్‌గా నిలిచాడు.

డెర్మోట్ 2 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 17 ఓవర్లలోనే నాలుగు వికెట్ల పతనానికి ఆస్ట్రేలియా 158 పరుగులు సాధించింది. వర్షం కారణంగా 17 ఓవర్లకే మ్యాచ్‌ను కుదించడం జరిగిందని సమీక్ష ద్వారా తెలియరావడంతో.. భారత్ 174 పరుగులను 17 ఓవర్లలో సాధించాల్సి వుంటుంది. 
 
భారత బౌలర్లలో బూమ్రా, అహ్మద్ చెరో వికెట్ సాధించగా, కుల్‌దీప్ యాదవ్ తన ఖాతాలో రెండు వికెట్లు వేసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లలో ఆర్జీ శర్మ (4) ధావన్  (13) పరుగులతో క్రీజులో వున్నారు.