వైజాగ్లో 29న నాలుగో వన్డే... అందుబాటులో 12 వేల టికెట్లు
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా ఈనెల 29వ తేదీన నాలుగో వన్డే మ్యాచ్కు వైజాగ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్ల అమ్మకం ప్రారంభంకానుంది. ప్రస్తుతం 12 వేల టిక్కెట్
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా ఈనెల 29వ తేదీన నాలుగో వన్డే మ్యాచ్కు వైజాగ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్ల అమ్మకం ప్రారంభంకానుంది. ప్రస్తుతం 12 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు.
ఇదే విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ... ఈ టికెట్లను ఈ నెల 25 నుంచి ఈసేవా కేంద్రాల్లో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. నాలుగు విభాగాలుగా టికెట్లను అందుబాటులో ఉంచామని, 400 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు, 5,000 రూపాయలు విభాగాల్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.