బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (18:16 IST)

సచిన్ లేకుండా చరిత్రలో తొలిసారి భారత్-పాక్ మ్యాచ్!: గెలుపు ఎవరిది?

భారత-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అదీ వరల్డ్ కప్ మ్యాచ్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు దాయాదులు వరల్డ్ కప్ చరిత్రలో ఐదు సార్లు తలపడ్డారు. అన్నింటా విజయం భారత జట్టుదే. విశేషమేంటంటే... ఈ ఐదు పర్యాయాలు భారత జట్టులో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 
 
తొలిసారి సచిన్ 1992 వరల్డ్ కప్‌లో ఆడాడు. భారత్-పాక్ జట్లు వరల్డ్ కప్‌లో తొలిసారి తలపడింది.. ఆ టోర్నీ ద్వారానే కావడం గమనార్హం. ఇప్పుడు సచిన్ రిటైర్మెంటు ప్రకటించాడు. తాజా వరల్డ్ కప్‌లో షెడ్యూల్ ప్రకారం భారత్-పాక్ ఫిబ్రవరి 15న అడిలైడ్ ఓవల్‌లో తలపడుతున్నాయి. 
 
గత మ్యాచ్‌లలో తన ప్రతిభ, అనుభవంతో జట్టు పైచేయి సాధించడానికి తోడ్పడిన ఈ బ్యాటింగ్ దేవుడు ఇప్పుడు వీక్షకుడయ్యాడు. దీంతో, దాయాదితో పోరులో భారత్ ఎలా ఆడుతుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.