గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2016 (11:52 IST)

అశ్విన్- విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించిన షోయబ్ అక్తర్!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ టీమిండియా క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఎప్పటికప్పుడు తన ప్రతిభను పెంపొందించుకునేందుకు శతథా యత్నిస్తున్న అశ్విన్... ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అని షోయబ్ కొనియాడాడు. టీమిండియా మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి అశ్విన్ జట్టును గెలుపు తీరాలకు చేరుస్తున్నానని చెప్పాడు. 
 
బ్యాటింగ్ విభాగంలో టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీనే అత్యుత్తమమని అక్తర్ తేల్చేశాడు. టీమిండియా కొత్త కుర్రాడు జస్ ప్రీత్ బుమ్రా అద్భుతమైన తీరుతో అరంగేట్రం చేశాడని వెల్లడించాడు. మొహ్మద్ షమీ, వరుణ్ ఆరోన్ లాంటి సీమర్లు దూరమవడం భారత్‌కు తీరని నష్టమేనని పేర్కొన్నాడు.