గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 2 నవంబరు 2016 (15:23 IST)

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ : రోహిత్ ఔట్.. పాండ్యా ఇన్.... విరాట్ కోహ్లీ సేన ఇదే

సొంతగడ్డపై పర్యాటక ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేసింది. విరాట్‌ కోహ్లి సారథ్యంలోని 15 మంది జట్టు సభ్యుల బృందాన్ని మొదటి రెండు టెస్టులకు

సొంతగడ్డపై పర్యాటక ఇంగ్లండ్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేసింది. విరాట్‌ కోహ్లి సారథ్యంలోని 15 మంది జట్టు సభ్యుల బృందాన్ని మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసింది. 
 
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఒక టెస్టు మ్యాచ్‌ ఆడిన గౌతమ్‌ గంభీర్‌, ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ జట్టులో చోటు దక్కించుకోగా, గాయం కారణంగా రోహిత్ శర్మతోపాటు.. ఓపెనర్లు ధావన్, కేఎల్.రాహుల్‌లకు చోటు కల్పించలేదు. అయితే, ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా తొలిసారి టెస్ట్‌జట్టుకు ఎంపిక కావడం విశేషం. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో గాయపడిన రోహిత్ స్థానంలో కరుణ్ నాయర్‌కు సెలెక్టర్లు జట్టులో స్థానం కల్పించారు.
 
మొదటి రెండు టెస్టులకు ఎంపికైన జట్టు: విరాట్‌ కోహ్లీ, రహానె, ఇషాంత్‌ శర్మ, చటేశ్వర పూజారా, గౌతమ్‌ గంభీర్‌, జయంత్‌ యాదవ్‌, అమిత్‌ మిశ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, వర్దమాన్‌ సాహా, కరుణ్‌ నాయర్‌, మురళీ విజయ్‌, మహ్మద్‌ షమి, ఉమేష్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య.