ఏప్రిల్ 8 నుంచి మే 24 వరకు... ఐపీఎల్-8వ సీజన్ షెడ్యూల్ విడుదల..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎనిమిదో సీజన్ షెడ్యూల్ను బుధవారం బీసీసీఐ విడుదల చేసింది. ఏప్రిల్ 8న ప్రారంభం కానున్న ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంప్ కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్కు వేదిక కానుంది.
47 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 60 మ్యాచ్లు నిర్వహిస్తుండగా, మే 24న జరిగే ఫైనల్తో ఈవెంట్ ముగుస్తుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పేర్కొంది. గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.