చెన్నై సూపర్ కింగ్స్తో ఐపీఎల్ మ్యాచ్: కోహ్లీ సేనకు కష్టాలు!
ఐపీఎల్ 8వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ పది పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఐపిఎల్లో ఆరంగేట్రం చేసిన మాడిసన్ నాలుగు పరుగులు మాత్రమే చేసి ఈశ్వర్ పాండే బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత రెండో వికెట్హా డీ విల్లీర్స్ అవుటయ్యాడు. ఆ వెంటనే 48 పరుగుల స్కోరు వద్ద మన్దీప్ సింగ్ పరుగులేమీ చేయకుండా మూడో వికెట్గా వెనుదిరిగాడు. 97 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కష్టాల్లో పడింది.
దినేష్ కార్తిక్ 97 పరుగుల వద్ద ఐదో వికెట్గా నెహ్రూ బౌలింగులో వెనుదిరిగాడు. అంతకు ముందు విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 48 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. ఎంతో నమ్మకం పెట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్ తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 111 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 112 పరుగుల వద్ద బెంగళూర్ ఏడో వికెట్ కోల్పోయింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్తో జరిగే ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అంతకుముందు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.