శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 నవంబరు 2015 (12:57 IST)

శ్రీశాంత్‌కు తప్పని కష్టాలు: హైకోర్టులో సవాల్ చేసిన ఢిల్లీ పోలీసులు

టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌కు మళ్లీ చిక్కులు తప్పేలా లేవు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుల్లో చిక్కుకుపోయిన శ్రీశాంత్ కష్టాలను కొనితెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిన శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్‌ను క్రీడాభిమానులను నివ్వెరపరిచారు. దీనిపై తొలుత విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ కోర్టు ముగ్గురు క్రికెటర్లను నిర్దోషులుగా ప్రకటించింది.
 
అయితే ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఢిల్లీ పోలీసులు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ  పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో మరోమారు పూర్తి స్థాయిలో విచారణ జరగనుంది.

అంతేకాక ఈ దఫా మరింత కీలక సమాచారాన్ని పక్కా ఆధారాలతో కోర్టుకు సమర్పించేందుకు ఢిల్లీ పోలీసులు సమాయత్తమవుతున్నారు. దీంతో హైకోర్టు విచారణలో శ్రీశాంత్ సహా ముగ్గురు క్రికెటర్లపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాలి.