శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (13:41 IST)

కోహ్లీ, రవిశాస్త్రిల వల్లే ఇషాంత్ శర్మకు ఈ పరిస్థితి: కోచ్ ఫైర్

శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ... లంకేయులకు చుక్కలు చూపించాడు. మొత్తం 13 వికెట్లు పడగొట్టిన ఇషాంత్ శర్మ చివరి టెస్టులో మాత్రం 8 వికెట్లు పడగొట్టి సిరీస్‌ను గెలుచుకోవడంపై కీలక పాత్ర పోషించారు. ఇదే సమయంలో, తనను తాను నిలువరించుకోలేక, శ్రీలంక ఆటగాళ్లతో వాదనకు దిగి ఒక టెస్టు మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. 
 
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, టీమ్ డైరక్టర్ రవిశాస్త్రిలపై ఇషాంత్ శర్మ చిన్ననాటి కోచ్ శ్రావణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వీరిద్దరి వల్లే ఇషాంత్ భావోద్రేకాలను నియంత్రించుకోవడంలో విఫలమయ్యాడని మండిపడ్డారు. స్లెడ్జింగ్ గురించి వీరిద్దరూ చెబుతుండటం వల్లే ఇషాంత్ కంట్రోల్ కోల్పోయాడని, చివరకు ఒక మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడన్నారు. 
 
ముఖ్యంగా కెప్టెన్, డైరెక్టర్ లాంటి వారు అగ్రెషన్ గురించి చెబుతున్నప్పుడు అలాంటి వాటిని పట్టించుకోరాదని కోచ్ హితవు పలికారు. ఇంత జరిగిన తర్వాత కోహ్లీ, రవిశాస్త్రి బాగానే ఉన్నారని... నిషేధం ఎదుర్కొంటున్నది ఇషాంత్ శర్మ మాత్రమే అని అన్నారు. ఇలాంటి ఘటనల ద్వారా ఇషాంత్ శర్మకు గుణపాఠం వస్తుందని, పరిపక్వత కూడా లభిస్తుందని.. ఇలాంటి పరిణామాలను ఎలా ఎదుర్కోవాలో బాగా అర్థమవుతుందని చెప్పారు.