200 వికెట్ల క్లబ్లో ఇషాంత్ శర్మ.. నాలుగో భారత్ ఫాస్ట్ బౌలర్
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అరుదైన ఫీట్ను సాధించారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో 200 వికెట్లు తీశాడు. ఈ ఘనతను సాధించిన భారత నాలుగో ఫాస్ట్ బౌలర్గా తన పేరును లిఖించుకున్నాడు. ఇషాంత్ శర్మ కంటే ముందు కపిల్ దేవ్ (434), శ్రీనాథ్ (236), జహీర్ ఖాన్ (311)లు ఉన్నారు. ఇపుడు ఇషాంత్ శర్మ ఈ అరుదైన ఫీట్ను సాధించాడు.
కాగా ప్రస్తుతం కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ క్రికెట్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ మ్యాచ్ చివరి రోజైన మంగళవారం సెంచరీ హీరో మ్యాథ్యూస్ (110)ను లెగ్ బిఫోర్ వికెట్గా ఔట్ చేశాడు. దీంతో 200 వికెట్లు తీసిన క్రికెటర్గా రికార్డు పుటలకెక్కాడు.