బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (08:27 IST)

నువ్వొక్క హిందుస్థానీ అయితే.. పాకిస్థాన్ గురించి ప్రశ్న అడగవు : విలేకరిపై కపిల్ ‌దేవ్ ఆగ్రహం

మీడియా మిత్రులపై భారత లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వొక భారతీయుడివైతే పాకిస్థాన్ గురించి నన్ను అలా అడగకూడదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. ముంబైలో జరిగిన 'కబడ్డీ వరల్డ్ కప్'క

మీడియా మిత్రులపై భారత లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వొక భారతీయుడివైతే పాకిస్థాన్ గురించి నన్ను అలా అడగకూడదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. ముంబైలో జరిగిన 'కబడ్డీ వరల్డ్ కప్'కు సంబంధించిన మీడియా కాన్ఫరెన్స్‌లో ఛీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న కపిల్ దేవ్‌కు చిరాకు తెప్పించిన ప్రశ్న ఎదురైంది. 
 
అక్కడ ఉన్న విలేఖర్లు కపిల్‌ను పలు ప్రశ్నలు అడుగుతుండగా, ఈలోపు ఒక విలేఖరి లేచి పాకిస్థాన్ ప్రస్తావన తెచ్చాడు. అక్టోబర్ 7 నుంచి అహ్మదాబాద్‌లో జరగనున్న ప్రపంచ కబడ్డీ పోటీల్లో పాకిస్థాన్ ఎందుకు పాల్గొనడంలేదని ప్రశ్నించాడు. అంతే కపిల్ దేవ్‌లోని కోపం ఒక్కసారి కట్టలు తెంచుకుంది.
 
'నువ్వొక హిందుస్థానీ అయితే నన్ను అలా అడగకూడదంటూ ఆగ్రహించుకున్నారు. కపిల్ దేవ్ తప్పకుడా ఉరీ ఉగ్రవాద ఘటనలో భారత జవాన్ల మరణం వెనక పాక్ హస్తం గురించే అలా అని ఉంటారు. అయితే తర్వాత ఆయన ఇంకా మాట్లాడుతూ.. అలాంటి విషయాలను భారత ప్రభుత్వానికి వదిలేయాలని సూచించారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఒక ఆటగాడిగా చెరువులో దూకమన్నా సరే దూకడానికి సిద్దంగా ఉండాలన్నాడు.