శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pyr

డేర్ డెవిల్స్ పై నైట్ రైడర్స్ విన్

ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఘన విజయం సాధించింది. గౌతం గంభీర్‌ మెరుపులు మెరిపించాడు. 49 బంతుల్లో 8 ఫోర్లతో 60 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతాకు ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. 
 
న్యూఢిల్లీలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి డేర్ డెవిల్స్ 146 పరుగులు చేసింది.  మనోజ్‌ తివారి (32) టాప్‌ స్కోరర్‌. బౌలర్లు ఉమేష్‌, మోర్కెల్‌, చావ్లా తలో రెండు వికెట్లు తీశారు. చివరి ఓవరులో ఉమేష్ యాదవ్ డేర్ డెవిల్స్ ను కట్టడి చేశారు. 147 పరుగుల లక్ష్య ఛేదన కోసం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

గంభీర్‌తో పాటు యూసుఫ్‌ పఠాన్ (40 నాటౌట్‌) కూడా రాణించాడు. ఉమేష్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు.