శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2015 (18:02 IST)

సంగక్కర్ రిటైర్మెంట్‌తో శ్రీలంకపైనే ఒత్తిడి : విరాట్ కోహ్లీ

శ్రీలంక దిగ్గజ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర రిటైర్మెంట్ అంశం శ్రీలంక క్రికెట్ జట్టుపైనే తీవ్ర ఒత్తిడి పెంచుతుందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటున్నాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అనూహ్య ఓటమిని మూటగట్టుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈనెల 20 నుంచి 24వ తేదీల మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్‌తో శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుమార్ సంగక్కర రిటైర్మెంట్ కానున్నారు.
 
దీనిపై కోహ్లీ స్పందిస్తూ 'సంగక్కర రిటైర్మెంటd అంశం కారణంగా లంక జట్టుపై మరింత ఒత్తిడి పడుతుందన్నారు. ఆ అంశం మమ్మల్నేమీ కలవరపరిచేది కాదు. ఇక, జట్టు అంచనాలపై ఆటగాళ్లు తేరుకోవాలని కోరుకుంటున్నాను. వారితో అదే చెప్పాను. ఓ భాగస్వామ్యంలో పరుగులు తీయడం ఎంత ముఖ్యమో, భావవ్యక్తీకరణ కూడా ముఖ్యమే. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సరిగా బ్యాటింగ్ చేయలేకపోయాం. అయితే, ఏ విభాగం కూడా చింతించాల్సిన స్థాయిలో లేదు. కుర్రాళ్లలో మంచి స్ఫూర్తి నెలకొని ఉంది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.