సచిన్ను కిడ్నాప్ చేసి.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ట్రైనింగ్ ఇప్పించండి: డేవిడ్ కామెరూన్
బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదీ భారత క్రికెట్ లెజెండ్ సచిన్పై కామెరూన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇంగ్లాండ్ -భారత్ మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో
బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదీ భారత క్రికెట్ లెజెండ్ సచిన్పై కామెరూన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇంగ్లాండ్ -భారత్ మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో రెండింటినీ భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
భారత్ పర్యటనలో నానా ఇబ్బందులు పడుతున్న ఇంగ్లండ్ జట్టుకు ట్రైనింగ్ ఇచ్చేందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను కిడ్నాప్ చేయాలంటూ చమత్కరించారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొంటున్న కామెరూన్ శనివారం సచిన్పై ఈ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం దేశంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న సిరీస్ని దృష్టిలో పెట్టుకుని కామెరూన్ మాట్లాడుతూ.. సచిన్ను కిడ్నాప్ చేసి, తమ ఆటగాళ్లకు ట్రైనింగ్ ఇప్పించాలన్నారు. మరోవైపు సచిన్ కూడా సమావేశానికి హాజరు కానున్నారు. తాను ఇండియాకు వచ్చిన ప్రతీసారీ దేశ పురోగతి, సామర్థ్యాన్ని చూసి ఎంతో ముగ్ధుడిని అవుతున్నానని వ్యాఖ్యానించారు.