సెమీఫైనల్స్లో టీమిండియా... ప్రత్యర్థి ఆస్ట్రేలియానా..పాకిస్తానా..!
ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ సెమీస్కు దూసుకెళ్లింది. గురువారం బంగ్లాదేశ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ను 109 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో తొలిత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.
ఓపెనర్ రోహిత్శర్మ విరోచిత సెంచరీతో ఆకట్టుకున్నాడు. రోహిత్ 126 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 137 పరుగులతో సూపర్ సెంచరీ చేశాడు. సురేష్రైనా 65, చివర్లో జడేజా 10 బంతుల్లో 23 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు.
అనంతరం 303 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన బంగ్లా భారత్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. 45 ఓవర్లలో 193 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. భారత్ బౌలర్లలో ఉమేష్యాదవ్ 4 వికెట్లు తీశాడు. రోహిత్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
భారత్ సెమీస్లో శుక్రవారం జరిగే ఆసీస్-పాకిస్తాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సిడ్నీలో ఈ నెల 26న జరిగే సెమీఫైనల్లో తలపడనుంది.