శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 జులై 2015 (10:10 IST)

ధోనీకి దూరంగా రైనా.. రితి స్పోర్ట్స్‌కు గుడ్ బై: ఐఓఎస్ స్పోర్ట్స్‌తో కొత్త ఒప్పందం!

టీమిండియా జట్టు మిడిలార్డర్ సురేష్ రైనా రితి స్పోర్ట్స్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఆటగాళ్ల ఎండార్స్‌మెంట్ వ్యవహారాలు చూసే ఐఓఎస్ స్పోర్ట్స్‌తో కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాడు. మూడేళ్లకు రూ.35 కోట్లు ఇచ్చేలా ఈ కొత్త ఒప్పందం కుదిరింది. 
 
తన ఆరాధ్య క్రికెటర్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ భాగస్వామిగా ఉన్న రితి స్పోర్ట్స్‌కు రైనా గుడ్ బై చెప్పడం అందరికీ షాక్ నిచ్చింది. ఇక నుంచి మూడేళ్ల పాటు రైనాకు సంబంధించి ఎండార్స్ మెంట్స్, కార్పొరేట్ ప్రొఫైల్, డిజిటల్ హక్కులు, పేటెంట్లు, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అతడి ఫొటోలు తదితర వ్యవహారాలన్నీ ఐఓఎస్ స్పోర్ట్స్ పర్యవేక్షించనుంది.
 
కాగా.. ధోనీ భాగస్వామిగా ఉన్న రితి స్పోర్ట్స్... ధోనీ, రైనా సహా మరికొంత మంది క్రికెటర్ల ఎండార్స్ మెంట్ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. అయితే కెప్టెన్ భాగస్వామిగా ఉన్న సంస్థలతో క్రికెటర్లు ఒప్పందాలు కుదుర్చుకుంటున్న వ్యవహరారాలపై వివాదాలు ముసిరిన నేపథ్యంలోనే రైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.