శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 24 మే 2015 (14:58 IST)

పాక్‌-జింబాబ్వే టీ-20 మ్యాచ్... 600 టికెట్లు చోరీ...

ఆరేళ్ల తర్వాత పాకిస్తాన్‌‌లో జింబాబ్వేతో జరుగుతున్న టి20 మ్యాచ్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూసిన అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. కొద్ది వ్యవధిలోనే అన్నీ అమ్ముడుపోయాయి. ఆ తర్వాత బ్లాక్‌లోనూ కొనేశారు. అయినా కొందరు వీరాభిమానులకు మాత్రం టికెట్లు దక్కలేదు. క్రికెట్ అభిమాన ఆవేశంతో ఉన్న వారు పీసీబీ కార్యాలయంలోకి చొరబడి 1500 రూపాయల విలువ గల 600 టికెట్లు చోరీ చేశారు. 
 
ఈ విషయంపై నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ పోతే పోనీలే పెద్ద విలువేం లేదు, అసలు అభిమానులు మ్యాచ్ చూస్తే చాలు, మాకు అదే తృప్తి అంటూ పాక్ బోర్డు అధికారులు సరిపుచ్చారు.