మహిళలతో అసభ్యంగా ప్రవర్తించలేదు.. నిబంధనల్ని ఉల్లంఘించనూ లేదు: అక్మల్
పార్టీకి హాజరై మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. అతనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇంగ్లండ్తో వచ్చే నెలలో జరిగే ట్వంటీ-20 టీమ్ నుంచి ఈ కుర్రాడిని తొలగించిన సంగతి విదితమే.
పాకిస్థాన్ జట్టులోని 16 మంది బృందంలో ముందు అక్మల్కు చోటు కల్పించినా.. అనంతరం పరిణామాల నేపథ్యంలో అతనిపై వేటు పడింది.
ఈ నేపథ్యంలో టీమ్ మేనేజర్ నుంచి అధికారిక అనుమతి తీసుకున్న తర్వాతే ఆ పార్టీకి తాను వెళ్లానని తెలిపాడు. క్రికెట్ నిబంధనలు ఉల్లంఘించలేదని పీసీబీకి అక్మల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మహిళల పట్ల తాను అభ్యంతకరంగా ప్రవర్తించలేదని చెప్పాడు.