గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 14 మే 2015 (12:34 IST)

ప్రీతి జింటా కొత్త అవతారం: అక్షర్ పటేల్‌కు ట్రాన్స్‌లేటర్‌గా..?

బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా.. కొత్త అవతారం ఎత్తనుంది. ఇప్పటివరకు సినీ నటిగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని, వ్యాపారవేత్తగా రాణించిన ప్రీతి జింటా ట్రాన్స్ లేటర్ అవతారమెత్తింది.

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు వీరాభిమానిగా మ్యాచ్‌లకు హాజరైంది. ఈ సందర్భంగా ఈ సొట్టబుగ్గల సుందరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన అక్షర్ పటేల్ హిందీలో ప్రావీణ్యుడు. 
 
ఇతర భాషలంటేనే కాస్త ఇబ్బంది పడతాడు. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్‌కు ప్రీతి జింటా ట్రాన్స్ లేటర్‌గా మారింది. అక్షర్ పటేల్ హిందీలో చెప్పిన మాటల్ని ఇంగ్లిష్ లోకి తర్జుమా చేసింది. దీనిపట్ల వెటరన్ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. ఫ్రాంఛైజీ యజమాని భేషజాల్లేకుండా ఓ క్రికెటర్‌కు ట్రాన్స్ లేటర్‌గా వ్యవహరించడం హర్షనీయమని పేర్కొన్నారు.