గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 5 మే 2015 (17:38 IST)

ఐపీఎల్ 8లో బ్యాటింగ్ ప్చ్.. ధోనీపైనే ఒత్తిడి..!: సురేష్ రైనా

ఐపీఎల్‌ గత సీజన్లలో ఓ మెరుపు మెరిసిన సురేష్ రైనా ఈ ఏడాది జరిగే ఐపీఎల్ 8వ సీజన్లో మాత్రం రాణించలేకపోతున్నాడు. రైనా ఆడకపోవడమే చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై రైనా స్పందిస్తూ.. తాను ఐపీఎల్ 8వ సీజన్లో రాణించలేకపోతున్నానని అంగీకరించాడు. ఐపీఎల్ 8వ సీజన్లో ధీటుగా రాణించలేకపోవడంతోనే జట్టు భారమంతా ధోనీ, బ్రావో, జడేజాలపై పడుతోందని.. తద్వారా ముఖ్యంగా ధోనీపై ఒత్తిడి పడుతోందని రైనా వ్యాఖ్యానించాడు.  
 
వాస్తవానికి ఇంతకుముందు ఆడిన మ్యాచ్‌ల్లో తాను అధిక పరుగులు సాధించానని.. అయితే ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌ల్ని ఆస్వాదించి ఆడుతున్నప్పటికీ.. రన్ రేటును పెంచలేకపోతున్నానని రైనా వ్యాఖ్యానించాడు. నా బ్యాటింగ్ బలహీనంగా ఉందనే విషయాన్ని గ్రహిస్తున్నాను. ఓపెనర్లు దూకుడు ఆడాలి. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు నిలకడగా రాణించాలని రైనా తెలిపాడు. మొత్తానికి ఈ సీజన్లో తన రన్ రేట్ మాత్రం తక్కువేనని రైనా ఒప్పుకున్నాడు. కానీ రన్ రేటును పెంచి జట్టు స్కోర్ రేటును పెంచేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పాడు.