గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 27 జూన్ 2016 (15:00 IST)

లండన్‌ నదిలో చేపలు పడుతున్న సచిన్ టెండూల్కర్.. వైరల్‌గా మారిన ట్విట్టర్ ఫోటో!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేపలు పడుతున్నాడు. ఆయనేంటి చేపలు పట్టడమేంటాని ఆలోచిస్తున్నారా.. అవును నిజమే... దాదాపు పాతికేళ్లపాటు క్రికెట్‌తో బిజీ అయిన సచిన్ రిటైర్మెంట్ తర్వాత కూడా క్రికెట్ కార్య

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేపలు పడుతున్నాడు. ఆయనేంటి చేపలు పట్టడమేంటాని ఆలోచిస్తున్నారా.. అవును నిజమే... దాదాపు పాతికేళ్లపాటు క్రికెట్‌తో బిజీ అయిన సచిన్ రిటైర్మెంట్ తర్వాత కూడా క్రికెట్ కార్యక్రమాలు, ఎండార్స్‌మెంట్లు, ప్రభుత్వ ఈవెంట్లు, చారిటీ ప్రోగ్రామ్స్ ఇలా అన్ని ప్రోగ్రాంలకు హాజరవుతూ బిజీబిజీగా గడిపాడు. దీంతో పూర్తిగా అలసిపోయిన సచిన్ హాయిగా విహారయాత్రలకు చెక్కేస్తున్నాడు. తాజాగా సచిన్ లండన్‌లో పర్యటిస్తున్నాడు. 
 
తన టూర్ వివరాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా లండన్ సమీపంలోని ఓ నది పాయలో చేపలు పడుతున్న ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. గాలం పట్టుకొని ఫిషింగ్ చేస్తున్న సచిన్ నవ్వుతూ.. చాలా ఉల్లాసంగా కనిపించాడు. టెన్నిస్ ఆటను అమితంగా ఇష్టమడే సచిన్.. వింబుల్డన్ టోర్నీని ఎంజాయ్ చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. టోర్నీ ముగిసే వరకు లండన్‌లోనే ఉండే ఛాన్సుంది.