గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (15:57 IST)

వినాయక చవితి సచిన్ ఇంట జాంటీ రోడ్స్.. కూతురి పేరు ఇండియా.. నెట్లో ఫోటో హల్ చల్

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ వినాయక చవితి సందర్భంగా సోమవారం తన అభిమానులకు ఓ ప‌రీక్ష‌ పెట్టాడు. వినాయ‌క చ‌వితి సందర్భంగా సచిన్‌ తన నివాసంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఈ ప్రత్యేక పూజలకు అ

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ వినాయక చవితి సందర్భంగా సోమవారం తన అభిమానులకు ఓ ప‌రీక్ష‌ పెట్టాడు. వినాయ‌క చ‌వితి సందర్భంగా సచిన్‌ తన నివాసంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఈ ప్రత్యేక పూజలకు అతిరథ మహరాజులు కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా గణేశ్ విగ్రహం ముందు కూర్చుని ప్రార్థిస్తున్న ఓ వ్యక్తి చిత్రాన్నితన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, ఎవరొచ్చారో కనుక్కోండంటూ అభిమానులను సచిన్ ప్రశ్నించారు. 
 
దీనికి స్పందించిన వేలాది మంది అభిమానులు ఫెదరర్ అని, పాంటింగ్ అని, బ్రెట్ లీ అని ఎవరికి తోచిన సమాధానాలు ఇస్తున్నారు. ఆ సస్పెన్స్‌ను తానే తొలగిస్తూ, పూజలు చేసింది ఎవరో కాదు దక్షిణాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం జాంటీ రోడ్స్ అని వెల్లడిస్తూ, యువరాజ్, జాంటీలతో కలసి దిగిన చిత్రాన్ని పోస్ట్ చేశారు. అతనికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే ఎంతో గౌరవం ప్రీతి అని తెలిపారు. 
 
అందుకే తన కూతురికి 'ఇండియా' అని పేరు పెట్టాడు. అతనే గణపతి ఆశీస్సులు పొందేందుకు తన ఇంటికి వచ్చాడని సచిన్‌ పేర్కొన్నారు. జాంటీరోడ్స్‌తోపాటు స్టైలిష్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ కూడా లిటిల్‌ మాస్టర్‌ ఇంట్లో పూజలకు హాజరై.. గణపతిని ప్రార్థించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాలలో చక్కెర్లు కొడుతోంది.