శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (18:26 IST)

ధోనీ సినిమాతో సుశాంత్‌కు గాయం- డబ్ స్మాష్‌ వీడియో కోహ్లీ అదుర్స్

బంగ్లాదేశ్ టూరు ముగించుకుని స్వదేశం చేరుకున్న టీమిండియా కెప్టెన్లు ధోనీ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం రిలాక్స్‌గా ఉన్నారు. డబ్ స్మాష్ వీడియోలను పలువురు సెలబ్రిటీలు మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా వీరి సరసన చేరాడు. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ డబ్ స్మాత్ వీడియోతో అదుర్స్ అనిపించుకున్నాడు. ఆ వీడియోలో కోహ్లీ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'హేరా-ఫేరీ' సినిమాలోని బాబూరావ్ పాత్రధారిలా డైలాగు చెప్పాడు. 
 
మిత్రుడు సందీప్ రాజ్ ఎదురుగా నిలుచుని ఉండగా, "యే బాబూరావ్ కా స్టైల్ హై" అని డైలాగు వల్లించాడు. కాగా, 'హేరా-ఫేరీ' చిత్రంలో బాబూరావ్ పాత్రను ప్రముఖ నటుడు పరేష్ రావల్ పోషించారు. ఆ సినిమాలో రావల్ నటనకు మంచి మార్కులొచ్చేసిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింద్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'ఎంఎస్ ధోనీ-ఏన్ అన్ టోల్డ్ స్టోరీ' పేరిట సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. ధోనీ ట్రేడ్ మార్క్ హెలికాప్టర్ షాట్ ఆడే క్రమంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పక్కటెముకలకు గాయాలైనట్టు సమాచారం. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కానుంది.