శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 2 మే 2018 (11:18 IST)

'బెంగాల్ టైగర్' ముఖ్యమంత్రి అవుతాడు : సెహ్వాగ్ జోస్యం

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పారు. బెంగాల్ టైగర్‌, దాదాగా నిక్‌నేమ్స్ కలిగిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏదో ఒకరోజున బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడంటూ విశ్వాసం వ్

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పారు. బెంగాల్ టైగర్‌, దాదాగా నిక్‌నేమ్స్ కలిగిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏదో ఒకరోజున బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడంటూ విశ్వాసం వ్యక్తంచేశాడు. సీఎం కంటే ముందుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు స్వీకరిస్తాడని తెలిపారు.
 
సౌరవ్ గంగూలీ రచించిన 'ఏ సెంచరీ నాట్‌ ఇనఫ్' పుస్తకావిష్కరణ కార్యక్రమం తాజాగా జరిగింది. ఇందులో సెహ్వాగ్ పాల్గొని మాట్లాడాడు. ఈ సందర్భంగా నాటి ఓ ఘటనను వీరు గుర్తుచేశాడు. 'ఓసారి మ్యాచ్‌ అయిపోయాక సౌరవ్‌ విలేకరుల సమావేశానికి వెళ్లాల్సి ఉంది. దాంతో తన బ్యాగును సర్దాల్సిందిగా అతడు మమ్మల్ని ఆదేశించాడు. మేమేమో జట్టులో జూనియర్లం. దాంతో కెప్టెన్‌ ఆదేశాన్ని శిరసావహించక తప్పలేదు' అని సభికుల నవ్వుల మధ్య వెల్లడించాడు. 
 
ఇందుకు గంగూలీ ముసిముసి నవ్వులు చిందిస్తూ 'అబ్బే.. వారేమీ నాపై ప్రేమతో అలా చేయలేదు. మ్యాచ్‌ కాగానే వెళ్లిపోవాల్సి ఉండటంవల్లే నా బ్యాగు సర్దారు' అని అన్నాడు. యువరాజ్‌ మాట్లాడుతూ, యువ క్రికెటర్లకు సౌరవ్‌ ఎంతో అండగా నిలిచేవాడని గుర్తు చేశాడు. అలాగే, దాదా స్పందిస్తూ, 'నేను కెప్టెన్‌గా ఉన్న సమయంలో అద్భుత జట్టు లభించింది. యువ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఆడేలా ప్రోత్సహించాను' అని చెప్పుకొచ్చాడు.