శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (18:46 IST)

సంగక్కర స్థానంలో ఉపుల్ తరంగకు చోటు: చివరి టెస్టులో పెరీరా ఆడుతాడా?

అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పేసిన శ్రీలంక స్టార్ ప్లేయర్ కుమార సంగక్కర స్థానంలో ఉపుల్ తరంగను జట్టులోకి ఎంపిక చేశారు. భారత్, శ్రీలంక మధ్య మూడో టెస్టు మ్యాచ్ నిర్ణయాత్మకం కావడంతో లంక బోర్డు జట్టులో మార్పులు చేర్పులు చేసే పనిలో పడింది. భారత్-శ్రీలంకల మధ్య చివరి టెస్టు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో శుక్రవారం ప్రారంభం కానుంది. 
 
భారత్‌తో రెండో టెస్టు అనంతరం కుమార సంగక్కర క్రికెట్‌కు గుడ్ బై చెప్పేయడంతో అతని స్థానంలో ఉపుల్ తరంగను జట్టులోకి తీసుకున్నారు. కెరీర్లో ఇప్పటిదాకా 20 టెస్టులాడిన తరంగ 31.80 సగటుతో 1113 పరుగులు చేశాడు. వాటిలో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక చివరి టెస్టులో ఆఫ్ స్పిన్నర్ తరిందు కౌశల్ ఆడటం డౌటేనని దీంతో హార్ట్ హిట్టర్ కుశాల్ పెరీరాకు చోటు కల్పించే ఛాన్సున్నట్లు తెలుస్తోంది.