శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (17:49 IST)

థట్ ఇండియన్ గై హారాస్డ్ మి: కోహ్లీపై ఫిర్యాదు చేసిన శ్రీలంక మహిళ!

భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా హోటల్‌లో శ్రీలంక మహిళ షాక్ ఇచ్చింది. ట్వంటీ-20 నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఓ హోటల్‌కు వెళ్ళాడు. ఆ హోటళ్లో శ్రీలంక మహిళకు కోహ్లీకి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుందని సదరు మహిళకు భర్త సామాజిక వెబ్ సైట్ ద్వారా తెలిపినట్లు శ్రీలంక మీడియా కోడైకూస్తోంది. 
 
ఆస్ట్రేలియాలో నివసించే శ్రీలంకకు చెందిన దర్షిక అనే మహిళ.. కోహ్లీ వెళ్ళి హోటల్‌లో బస చేసింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్ళిన సమయంలో.. విరాట్ కోహ్లీ మేనేజర్ దర్షిక అనే మహిళ కోహ్లీతో ఫోటో దిగేందుకే వచ్చిందనుకుని.. బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఫోటో దిగడం కుదరదని చెప్పాడు. దీంతో గందరగోళానికి గురైన ఆ మహిళ ఏంటి ఫోటో దిగాలా? ఎవరితో? అని ప్రశ్నించింది. దీంతో కలుగజేసుకున్న కోహ్లీ.. మీరు నాతో ఫోటో దిగేందుకు వచ్చారని అనుకున్నాడని చెప్పాడు. 
 
ఇందుకు సమాధానమిచ్చిన శ్రీలంక మహిళ.. నేను మీతో  ఎందుకు ఫోటో తీయించుకోవాలి. మీరెవరు? మీరు సెలబ్రిటీనా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో షాక్ అయిన కోహ్లీ.. ఆ మహిళకు సారీ చెప్పి.. అక్కడ నుంచి పారిపోయాడు. అయితే ఆ శ్రీలంక మహిళ మాత్రం ఆ ఇండియన్ యువకుడు తనను వేధించినట్లు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాన్ని శ్రీలంక మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.