రామతీర్థంలోనే శ్రీరామ కల్యాణం ప్రభుత్వమే నిర్వహించాలి.. ఆమరణ దీక్ష!
రాష్ట్రం విడిపోయాక ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామ కల్యాణం జరగాలని శ్రీనివాసానంద సరస్వతి ఆమరణ దీక్షకు దిగారు. దీంతో శ్రీరామ కల్యాణం విషయం చర్చనీయాంశంగా మారింది.
అలాగే విజయనగరం జిల్లాలోని రామతీర్థంలోనే శ్రీరామనవమి వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, శ్రీనివాసానంద సరస్వతి ఆమరణ దీక్షకు దిగారు.
గురువారం ఉదయం మహారాజుకోట దగ్గర శ్రీనివాసానంద సరస్వతి దీక్షకు దిగారు. ఆయన ఆమరణ దీక్షకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి. కాగా, అభిజిత్ లగ్నంలో శ్రీరామ కల్యాణం జరగకపోతే ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని విశ్రాంత ప్రొఫెసర్ ఏవీ సుబ్బారావు హెచ్చరించారు.