వర్షంలో చిక్కుకున్న టీమిండియా.. ఎయిర్ పోర్టులోనే గంటల కొద్ది..!
సౌతాఫ్రికా జట్టును చిత్తు చేసి, ఘన విజయం సాధించిన టీమిండియా భారీ వర్షంలో చిక్కుకుంది. ఆస్ట్రేలియా నగరం మెల్ బోర్న్లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్లో విజయాన్ని కైవసం చేసుకున్న ధోనీ సేన, తదుపరి మ్యాచ్ కోసం ఆ దేశంలోని మరో నగరం పెర్త్కు సోమవారం ఉదయం బయలుదేరింది.
అయితే ఉదయం నుంచి మెల్బోర్న్ నగరంలో భారీ వర్షం కుమ్మరిస్తుండడంతో నగరంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. వర్షం నేపథ్యంలో పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో పెర్త్ వెళ్లేందుకు అప్పటికే ఎయిర్ పోర్టు చేరుకున్న టీమిండియా సభ్యులు విమానాశ్రయంలోనే హాల్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.