గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (13:03 IST)

అనిల్ కుంబ్లే పర్ఫెక్ట్ 10కు 20 ఏళ్లు

అవును పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లను ఒక్కొక్కరిని పెవిలియన్‌కు సాగనంపుతూ.. 26.3 ఓవర్లతో 74 పరుగులిచ్చి .. పది వికెట్లు పట్టేసిన ఘనత సాధించాడు.. అనిల్ కుంబ్లే. తద్వారా అరుదైన ఘనత భారత్ ఖాతాలో పడిన రోజు.. ఈ రోజే.
 
ఫిబ్రవరి 7, 1999.. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత బౌలింగ్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్టుల్లో పర్ఫెక్ట్ టెన్ సాధించింది.. ఈ రోజునే. ఈ అద్భుతం జరిగి ఈ రోజుతో 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. తన స్పిన్ మాయాజాలంతో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లను పెవిలియన్‌కు సాగనంపాడు. 
 
10 వికెట్ల ఘనత ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ ఖాతాలోనే వుండేది. ఆయన 1956లో పర్ఫెక్ట్ టెన్ సాధించాడు. అది జరిగిన 43 ఏళ్లకు మన కుంబ్లే మళ్లీ అలాంటి ఫీట్ చేసి.. ఈ రికార్డు సృష్టించిన రెండో బౌలర్‌గా క్రికెట్ చరిత్రలో నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్సులో 252 పరుగుల చేసి ఆలౌట్ అయ్యింది. 420 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. మొదట్లో జోరుమీద కనిపించింది. 
 
పాక్ బ్యాట్స్‌మెన్లలో 41 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర అఫ్రీది ఔట్ కావడంతో కుంబ్లే బంతికి పనిచెప్పాడు. కుంబ్లే బౌలింగ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టారు. 207 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కుంబ్లే సూపర్ ఇన్నింగ్సులో మూడు ఎల్బీడబ్ల్యూలు వుండటం విశేషం.