గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (20:40 IST)

కోహ్లి 1, హర్భజన్ 0, రాయుడు 0, ధోని 5... మరీ ఇంత ఘోరంగానా....?

ట్వంటీ-20లో మరోసారి టీమిండియా సఫారీల దెబ్బకు గిలగిలలాడిపోయింది. పటిష్టమైన బౌలింగుతో టీమిండియా బ్యాట్సమన్లను వరసబెట్టి పెవిలియన్ కు పంపారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసేందుకు దిగిన భారత ఆటగాళ్లు, ఆడేందుకు కాదు... పెవిలియన్ ఎటు ఉన్నదా అన్నట్లు వికెట్లు కూల్చేసుకుంటూ క్యూ కట్టారు. 
 
రోహిత్ శర్మ 22, ధావన్ 11, కోహ్లి 1, రైనా 22, రాయుడు 0, ధోనీ 5, పటేల్ 9, హర్భజన్ 0, కుమార్ 0... ఇలా వరసబెట్టి ఔటయ్యారు. ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు మరీ స్వల్ప స్కోరుకే వెనుదిరగడం చూస్తుంటే సిరీస్ సఫారీలకు అప్పజెప్పేట్లున్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం 17.2 ఓవర్లకు ఆలౌట్ అయి కేవలం 92 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ స్కోరును సఫారీలు అవలీలగా లాగించేస్తారనడంలో సందేహం ఏముంది...?