శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (18:49 IST)

చెన్నై సూపర్ కింగ్స్‌ను కొనబోతున్న త్రిష వుడ్ బి వరుణ్!?

దక్షిణాది సినీ నటి త్రిషతో ఇటీవల నిశ్చయ తాంబూలాలు మార్చుకున్న వరుణ్ మణియన్ చెన్నై ఫ్రాంచైజీని కొనేందుకు పోటీపడుతున్న వారిలో ఉన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 13న ఐపిఎల్ ఫ్రాంచైజీల వేలం జరిగే అవకాశం ఉంది. 
 
అందులో చెన్నై ఫ్రాంచైజీ అమ్మకానికి వస్తే, దానిని కొనేందుకు మణియన్ సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే, చెన్నై ఫ్రాంచైజీ అధికారులు మాత్రం ఈ వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఎవరూ ఎలాంటి ప్రతిపాదనలతో ముందుకు రాలేదని వారు చెబుతున్నారు.
 
కాగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌ను వదులుకోవడానికి శ్రీనివాసన్ సిద్ధమైనట్లు తెలిసింది. పలు మీడియాల్లో వచ్చిన వార్తల ప్రకారం.. చెన్నై ఫ్రాంచైజీని ఎమ్మారెఫ్ కంపెనీ కొనుగోలు చేయడం దాదాపు ఖాయమైంది. ఇండియా సిమెంట్స్ కంపెనీ యజమాని అయిన శ్రీనివాసన్ చెన్నై ఫ్రాంచైజీని ఇప్పటి వరకు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. 
 
అయితే ఐపిఎల్ ఫ్రాంచైజీకి సొంతదారుడుగా ఉంటూ, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడిగా ఉండేదుకు వీలులేదని సుప్రీం కోర్టు ఇటీవల స్పష్టం చేసిన సంగతి విదితమే.