''అనుష్క శర్మను డివిలియర్స్ కాపాడాడు''.. కోహ్లీ ముద్దులే ముద్దులు.. సోషల్ మీడియాలో?!
టీమిండియా స్టార్ ప్లేయర్, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు కలిసినా, విడిపోయినా సెన్సేషనల్ న్యూసే. కోహ్లీ ఏదైనా మ్యాచ్లో రాణించకపోయినా.. ఆ మ్యాచ్ గెలవకపోయినా.. దానికి అనుష్క శర్మనే కారణమని వార్తలొచ్చే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి జరిగిన ఉత్కంఠభరితంగా జరిగిన ఐపీఎల్ తొలి క్యాలిఫైయర్ మ్యాచ్పై సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఈ మ్యాచ్ లో కోహ్లి డక్ అవుట్ అవ్వడంతో రాయల్ చాలెంజర్స్ కష్టాల్లో పడింది. దీనితో ఈ మ్యాచ్ లో కోహ్లి సేనకు ఓటమి తప్పదని అందరూ అనుకున్నారు. అంతలోపే కోహ్లీ, అనుష్క మళ్లీ కలిశారా అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. కానీ అనూహ్యంగా డివిలియర్స్ సూపర్ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. ఒంటి చేత్తో జట్టుకు విజయం సాధించిపెట్టాడు. దీంతో అనుష్క శర్మ బతికిపోయింది. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడివుంటే అనుష్క శర్మపై విమర్శలు తప్పవు.
అయినా కోహ్లీపై సోషల్ మీడియాలో విమర్శలు తగ్గలేదు. జట్టు విజయానికి సహకరించిన డివిలియర్స్పైకి గంతులేసి కోహ్లీ ముద్దుల వర్షం కురిపించడంపై పలురకాల కామెంట్స్ వస్తున్నాయి.
ఈ మ్యాచ్లో ఓడిపోయుంటే తన ప్రియురాలు అనుష్క శర్మపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పించే వాళ్లని అలా జరగక పోవడంతో కోహ్లి ఆనందంతో ఎగరిగంతేశాడని కామెంట్స్ వచ్చాయి. ఇక జడేజా ఒక అడుగు ముందుకు వేసి.. 'అనుష్క శర్మని డివిలియర్స్ కాపాడాడు' అని తన ట్విట్టర్లో కామెంట్ చేశాడు.